వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉంది: రామ్మోహన్‌ నాయుడు

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో స్పష్టం చేశారు. రాష్ట్రాలకు వెనుకబడిన ...

Published : 11 Aug 2021 01:50 IST

దిల్లీ: వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో స్పష్టం చేశారు. రాష్ట్రాలకు వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని కట్టబెడుతూ కేంద్రం తీసుకువచ్చిన  రాజ్యాంగ సవరణ బిల్లుపై  జరిగిన చర్చలో రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 3 దశాబ్దాల క్రితమే మండల్‌ కమిషన్‌ ప్రతిపాదించిన రిజర్వేషన్లను తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ స్వాగతించారని సభకు గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని