Chidambaram: చమురు ధరల తగ్గింపు.. ఉప ఎన్నికల ఉప ఉత్పత్తి
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడాన్ని భాజపా నేతలు దీపావళి కానుక అంటుంటే.. కాంగ్రెస్ మాత్రం ఉపఎన్నికల ఎఫెక్ట్ అంటూ ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ‘ఇది ఉప ఎన్నికల ఉప ఉత్పత్తి’ అంటూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎద్దేవా
దిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడాన్ని భాజపా నేతలు దీపావళి కానుక అంటుంటే.. కాంగ్రెస్ మాత్రం ఉపఎన్నికల ఎఫెక్ట్ అంటూ ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ‘ఇది ఉప ఎన్నికల ఉప ఉత్పత్తి’ అంటూ ట్వీట్ చేశారు.
‘ఇటీవల జరిగిన 30 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితమే ఈ ఉప ఉత్పత్తి. కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అధిక సుంకాలే చమురు ధరల పెరుగుదలకు కారణమన్న మా వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. కేంద్రం దురాశే ఈ అధిక సుంకాలకు కారణం అవుతోంది’ అని విమర్శించారు.
గత కొంతకాలంగా చమురు ధరల మంటలతో దేశం అల్లాడిపోతోంది. ఈ క్రమంలో నిన్న కేంద్రం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. గురువారం నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా భాజపాకు షాక్ తగిలింది. ఆ ఫలితమే సుంకాల తగ్గింపులో కనిపించదన్న ఛలోక్తులు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్