Revanth Reddy: మూడుచింతలపల్లిలో రేవంత్ ‘రచ్చబండ’
మూడుచింతపల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామంలోని దళితవాడలో నిద్రించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి..
మేడ్చల్: మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామంలోని దళితవాడలో నిద్రించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. రెండో రోజు ఉదయం రచ్చబండ నిర్వహించారు. దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కాలనీ అంతా కలియ తిరిగి అక్కడికి పరిస్థితులను పరిశీలించారు. పలువురు దళితులు తమ గ్రామ సమస్యలను రేవంత్కు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తోందని.. కాలనీలో రోడ్డు ఎత్తుగా వేయడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్కు ఫోన్ చేసి మూడుచింతలపల్లి స్థానిక సమస్యలను వివరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్