Revanth: ఇంటి దొంగలను వదిలేది లేదు!

 కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో... కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో

Updated : 12 Jul 2021 16:41 IST

నిర్మల్‌:  కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌక్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కోసం కష్టపడిన వారిని వదులుకునేది లేదని, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు ‘‘ కేసీఆర్‌ లక్కీ నెంబర్‌ 6, నా లక్కీ నెంబర్‌ 9. ఆరు నెంబర్‌ను తిరగేస్తే 9 అవుతుంది. వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి మహేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమాలతో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని