కూకట్‌పల్లిలో యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌షో

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నగరానికి చేరుకున్నారు. భాజపా కార్పొరేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా

Updated : 08 Dec 2022 18:59 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నగరానికి చేరుకున్నారు. భాజపా కార్పొరేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా కూకట్‌పల్లి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి కమాన్‌ నుంచి ఆల్విన్‌ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోడ్‌షోలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, నేతలు మురళీధరరావు, పెద్దిరెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు భాజపా, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని