Uttam kumar reddy: ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రధాని చెప్పాలి: ఉత్తమ్కుమార్రెడ్డి
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్రమోదీ (Modi) ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని
హైదరాబాద్: దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్రమోదీ (Modi) ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి (Uttam kumar reddy)డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని అబద్ధపు వాగ్దానాలు చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల వివరాలను దాచిపెట్టేందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి డేటాను విడుదల చేయడం మానేసిందని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను సహజ, ప్రమాద మరణాలుగా నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించడం ద్వారా తెరాస ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల లెక్కలను చూపడంలేదని మండిపడ్డారు. ఈ మేరకు ఉత్తమ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘దేశ వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎప్పుడు ఇల్లు లభిస్తుందో ప్రధాని చెప్పాలి. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అందించిన డేటా ఆధారంగా.. దేశంలోని 52శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. దాదాపు 80శాతం భారతీయులు విషపూరిత నీటిని తాగాల్సి వస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలతో ప్రజలను మోసం చేసిన మోదీ.. ఇప్పుడు ‘అమృత్ కల్’ గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి అన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు’’ అని ఉత్తమ్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.