నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్న శశికళ

ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ ఆస్పత్రి నుంచి ఆదివారం విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరు వైద్య కళాశాల శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. శ్వాస సంబంధిత సమస్యలతో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శశికళకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. 

Updated : 19 Oct 2022 15:54 IST

బెంగళూరు: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరు వైద్య కళాశాల శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. శ్వాస సంబంధిత సమస్యలతో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శశికళకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. 

‘శశికళకు పదిరోజుల చికిత్స పూర్తైంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవు. గత మూడు రోజులుగా ఆక్సిజన్‌ లేకుండా తాను శ్వాస తీసుకోగలుగుతున్నారు. ఇక ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వొచ్చు. వైద్యుల హోంక్వారంటైన్‌ సూచన మేరకు ఆమె రేపు విడుదల కానున్నారు’ అని బెంగళూరు వైద్య కళాశాల విడుదల చేసిన ఆరోగ్య నివేదిక వెల్లడించింది. 

2017లో అవినీతి కేసులో అరెస్టై నాలుగేళ్ల శిక్ష అనుభవించిన శశికళ, జనవరి 27న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందే జనవరి 20న ఆమె అనారోగ్యం బారిన పడటంతో.. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఆమె విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆస్పత్రి నుంచే పూర్తి చేశారు.  

ఇదీ చదవండి

దిల్లీ పేలుడు ఆ ఉగ్రవాదుల పనేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని