UP Election 2022: కొనసాగుతోన్న మొదటి విడత పోలింగ్..
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం మొదటి అంకం ప్రారంభమైంది. మొదటి దశ ఓటింగ్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు దాదాపు 8 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది.
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశ ఓటింగ్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు దాదాపు 8 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది.
‘ ఉదయం 9 గంటల వరకు మొదటిదశలో 7.95 శాతం పోలింగ్ జరిగింది’ అని ఈసీ ప్రకటించింది. ఆగ్రా, అలీగఢ్, బాఘపత్, బులంద్ షహర్, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, హాపూర్, మథుర, మేరఠ్, షామ్లిలో ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలుండగా.. మొదటి దశలో 58 స్థానాల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకొంటున్నారు.
జయంత్ ఓటు వేయకపోవచ్చు!..
ఎస్పీ మిత్రపక్షం ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌధరీ ఓటువేయరని తెలుస్తోంది. ఎన్నికల ర్యాలీ కారణంగా ఆయన ఓటు వేయడం సాధ్యంకాదని పార్టీ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. ఆయనకు మథుర ప్రాంతంలో ఓటు ఉంది.
ఓటేసిన అఖిలేశ్ ప్రత్యర్థి, కేంద్రమంత్రి..
కేంద్రమంత్రి, భాజపా నేత ఎస్పీ సింగ్ బఘేల్ ఆగ్రాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్పై కర్హాల్ నుంచి ఆయన బరిలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.