కేరళ సీఎంపై హత్యాచార బాధితురాళ్ల తల్లి పోటీ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎంకు పోటీగా అత్యాచార బాధితురాళ్ల తల్లి బరిలోకి
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి బరిలోకి దిగుతున్నారు. మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వలయార్ అక్కాచెల్లెళ్ల హత్యాచారం కేసులో మృతుల తల్లి.. ధర్మదాంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నా. నా కుమార్తెలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా’’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ధర్మదాం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తాజా పరిణామాలపై కేపీసీపీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ మాట్లాడుతూ.. వయనార్ బాధితుల తల్లికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయం సరైందేనని, ఆమె రాకతో ఎన్నికల వేడి మరింత పెరిగిందని అన్నారు.
2017లో వలయార్ ప్రాంతంలో అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు బాలికపై కొందరు అతిదారుణంగా అత్యాచారం చేసి వారిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ స్థానిక కోర్టు ఆ మధ్య తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో కేరళ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. మరోవైపు తమ కుమార్తెలకు న్యాయం చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న మృతురాళ్ల తల్లి.. జనవరి 26 నుంచి పాలక్కడ్లో సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. గత నెల గుండు గీయించుకుని తన నిరసన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.