UP Elections: అయోధ్య రామ మందిరాన్ని భాజపా కన్నా వేగంగా నిర్మిస్తాం: ఎస్పీ
త్వరలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. ఇతర పార్టీలు చేసిన విమర్శలకు గట్టిగా బదులిస్తున్నాయి. గతంలో సమాజ్వాది నేత అఖిలేశ్ యాదవ్ అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ భాజపా నేత, కేంద్ర హోం మంత్రి
లఖ్నవూ: త్వరలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. ఇతర పార్టీలు చేసిన విమర్శలకు గట్టిగా బదులిస్తున్నాయి. సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ గతంలో భాజపా నేత, కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. తాము అధికారంలోకి వస్తే భాజపా కంటే వేగంగా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
‘‘అఖిలేశ్ యాదవ్ రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ, ఎవరూ ఆపలేరంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అసలు.. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? నిజం చెప్పాలంటే వాళ్లే(భాజపా నేతల్ని ఉద్దేశించి) ఆలయానికి వచ్చే విరాళాలను దారి మళ్లిస్తున్నారు. రామాలయం పరిసరాల్లోని స్థలాలను భాజపా అనుకూల వ్యక్తులు కొనుగోలు చేశారు’’అని భాజపాపై రామ్ గోపాల్ యాదవ్ విమర్శలు గుప్పించారు. అఖిలేశ్ ప్రభుత్వం వచ్చాక ఆలయ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని.. ఉన్నతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే ఆలయ విరాళాల దారి మళ్లింపు ఆగిపోతుందని ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. మార్చి 10వ తేదీన పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం