గుజరాత్, దిల్లీ ఎన్నికల వేళ.. భాజపా, ఆప్ మధ్య ఆరోపణల పర్వం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆమ్ఆద్మీ పార్టీ మరోసారి ఆరోపించింది. ఇందులో భాజపా ఎంపీ మనోజ్ తివారీ పాత్ర ఉందని.. వీటిపై పూర్తి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
దిల్లీ: గుజరాత్తోపాటు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతోన్న వేళ.. భాజపా, ఆమ్ఆద్మీ పార్టీ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) చంపేందుకు కుట్ర జరుగుతోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఆప్ చేతిలో ఓటమి భయంతోనే భాజపా ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందులో భాజపా నేత మనోజ్ తివారీ (Manoj Tiwari) పాత్ర ఉందని.. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ భద్రతపై ఆందోళన కలుగుతోందంటూ భాజపా నేత మనోజ్ తివారీ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి కారణమయ్యింది.
‘అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన (మనోజ్ తివారీ) మాట్లాడిన భాషలోనే అర్థమవుతోంది. కేజ్రీవాల్పై దాడి చేయాలని ఆయన అనుచరులకు బహిరంగంగా చెబుతున్నారు. ఇదంతా పక్కా ప్రణాళికతోనే జరుగుతోంది. ఈ బెదిరింపులు చేస్తోన్న మనోజ్ను వెంటనే అరెస్టు చేసి, దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా (Manish Sisodia) పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ హత్యకు జరుగుతోన్న కుట్రపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు.
సిసోదియా చేసిన ఆరోపణలను భాజపా నేత మనోజ్ తివారీ తోసిపుచ్చారు. ‘పాత స్క్రిప్ట్నే సిసోదియా చదువుతున్నారు. ఓవైపు సిసోదియా అరెస్టు అవుతారంటూ కేజ్రీవాల్ చెబుతుంటే.. కేజ్రీవాల్ను చంపాలని భాజపా చూస్తోందంటూ సిసోదియా చెప్పడం విడ్డూరం. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు’ అని మనోజ్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా భాజపా, ఆప్ నేతల ఆరోపణలపై స్పందించిన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. నేతల ఆరోపణలన్నింటిపై దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్కు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం