Somireddy: జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
చంద్రబాబు హయాంలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన ‘సింహపురి స్త్రీ శక్తి’ చర్చావేదికలో ఆయన మాట్లాడారు.
నెల్లూరు: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) హయాంలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు. సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో నెల్లూరులో (Nellore) నిర్వహించిన ‘సింహపురి స్త్రీ శక్తి’ చర్చావేదికలో సోమిరెడ్డి మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికీ మరుగుదొడి నిర్మించామని చెప్పారు. మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ (YS Jagan).. ఆ మాటే మర్చిపోయారని మండిపడ్డారు. జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఏపీని బ్యాంకులు బ్లాక్ లిస్ట్లో పెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురవుతున్నారు. మహిళలు జాగృతమైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ఇసుక నిర్వహణను డ్వాక్రా మహిళలు చక్కగా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతోంది. 2024లో జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి’’ అని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!