భర్తను వీడి ప్రియుడి ఇంటికి.. వివస్త్రను చేసి దాడి చేసిన గ్రామస్థులు
మధ్యప్రదేశ్లో ఓ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆమెను చితకబాదారు. భర్తను మహిళ భుజాలపై ఊరేగించిన జనం.. అనంతరం ఆమెకు, ప్రియుడికి చెప్పులదండ వేసి
మధ్యప్రదేశ్లో ఓ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆమెను చితకబాదారు. భర్తను మహిళ భుజాలపై ఊరేగించిన జనం.. అనంతరం ఆమెకు, ప్రియుడికి చెప్పులదండ వేసి చితకబాదారు. ఈ క్రమంలో బాధితురాలిని వివస్త్రను చేశారు. ఈ ఘటన దేవాస్ జిల్లా బోర్పాడవ్ గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితురాలు అదే గ్రామానికి చెందిన హరీ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గత నెల 24న ఆమె ఇంటి నుంచి పరారై గుట్టుగా ప్రియుడి ఇంట్లో నివసిస్తోంది. భార్య కనిపించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త మంగీలాల్.. గ్రామంలో కూడా ఆమె కోసం వెతికాడు. అనుమానం వచ్చి హరీ సింగ్ ఇంటికి వచ్చిన మంగీలాల్.. ఓ గదిలో తలదాచుకుంటున్న భార్యను చూశాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని చితకబాదారు. బాధితురాలిని వివస్త్రను చేసిన దాడి చేశారు. హరీ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాధితులపై దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం