Lottery: లాటరీలో రూ.3,197 కోట్లు: ఇంకా తెలియని విజేత వివరాలు

రూ.3,197 కోట్ల (426 మిలియన్‌ డాలర్ల) జాక్‌పాట్‌ తగిలింది. అయితే 

Updated : 31 Jan 2022 09:46 IST

లాస్‌ఏంజెలెస్‌: అమెరికాలో ఓ వ్యక్తికి లాటరీలో 

రూ.3,197 కోట్ల (426 మిలియన్‌ డాలర్ల) జాక్‌పాట్‌ తగిలింది. అయితే ఆ అదృష్టవంతులెవరో తెలియాల్సి ఉంది. కాలిఫోర్నియాలో అతిపెద్ద లాటరీలలో ఒకటైన ‘మెగా మిలియన్స్‌ జాక్‌పాక్‌ ప్రైజ్‌’ పొందిన టికెట్‌ నంబరును శుక్రవారం రాత్రి డ్రా తీశారు. విజేతకు అందజేసే మొత్తాన్ని ప్రకటించారు. లాస్‌ఏంజెలెస్‌లోని వుడ్‌లాడ్‌ హిల్స్‌ సెక్షన్‌ వద్ద ఓ గ్యాస్‌ స్టేషన్‌లో ఆ టికెట్‌ అమ్ముడైనట్టు గుర్తించారు. ఆ టికెట్‌ను తీసుకొచ్చి, లాటరీ సొమ్ము తీసుకొనేందుకుఓ సంవత్సరం గడువు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని