Coaching: రూ.2కే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు కోచింగ్‌

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు

Updated : 09 Apr 2022 10:46 IST

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అరుదైన ఆఫర్‌ ప్రకటించింది అక్కడ ఓ కోచింగ్‌ సంస్థ. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రూ.2కే రివిజన్‌ తరగతులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆఫీసర్స్‌ అకాడమీ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ శర్మ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్లే స్టోర్‌ నుంచి ఇన్‌స్టిట్యూట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని లేదా వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో తరగతులు వినొచ్చని చెప్పారు. ఇప్పటివరకు 4 వేల మంది నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదికాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ‘వైభవ్‌ 30’ పేరుతో ఓ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్‌ నిర్దేశించిన ఓ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని