IND vs ENG: మేం 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచేశాం: రోహిత్‌ శర్మ

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచినట్లుగా భావిస్తున్నట్లు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు. రద్దయిన టెస్టు విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని రోహిత్‌ తెలిపాడు.

Updated : 05 Oct 2021 10:27 IST

దుబాయ్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచినట్లుగా భావిస్తున్నట్లు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు. రద్దయిన టెస్టు విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని రోహిత్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉండగా.. కరోనా కారణంగా మాంచెస్టర్‌లో జరగాల్సిన ఆఖరి టెస్టు రద్దయింది. వచ్చే ఏడాది జులైలో ఈ మ్యాచ్‌ ఆడతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రకటించాడు. ‘‘చివరి టెస్టు విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వచ్చే ఏడాది ఒక్క టెస్టే ఆడాల్సొచ్చినా.. నా వరకు మాత్రం 2-1తో మేం సిరీస్‌ గెలిచేశాం. నా టెస్టు కెరీర్‌ ప్రకారం ఇంగ్లాండ్‌ పర్యటన మంచి సిరీస్‌ అన్నట్లే. కాని అత్యుత్తమ సిరీస్‌ మాత్రం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉంది. సౌథాంప్టన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నా. అవసరమైన టెక్నిక్‌, ఆలోచన విధానంపై కసరత్తు చేశా. భవిష్యత్తులోనూ ఇదే ఆటతీరే కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని రోహిత్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని