ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడు
టీమ్ఇండియాకు కెప్టెన్గా ఉన్నప్పుడైనా.. ఇటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా ధోని మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. తన భావోద్వేగాలను నియంత్రించుకుంటాడు.
దిల్లీ: టీమ్ఇండియాకు కెప్టెన్గా ఉన్నప్పుడైనా.. ఇటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు సారథిగా ధోని మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. తన భావోద్వేగాలను నియంత్రించుకుంటాడు. కానీ అలాంటి ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడంటా. ఈ విషయాన్ని సీఎస్కే మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ‘‘మీతో ఓ కథను పంచుకోవాలనుకుంటున్నా. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో తిరిగి ఐపీఎల్లో చెన్నై పునరాగమనం చేసింది. అప్పుడు ఓ సారి జట్టు విందు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ధోని ఏడ్చాడు. భావోద్వేగానికి గురయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదనుకుంటా’’ అని ఓ షో సందర్భంగా చెప్పిన హర్భజన్.. పక్కనే ఉన్న ఇమ్రాన్ తాహిర్ను కూడా ఆ సంఘటన గురించి అడిగాడు. ‘‘అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా. అది ధోనీకి ఎంతో ఉద్విగ్నమైన క్షణం. అప్పుడు ధోనీని చూస్తే సీఎస్కే అతని హృదయానికి ఎంత దగ్గరగా ఉందో అర్థమైంది. ఈ జట్టును అతను కుటుంబంలా చూస్తాడు. ఆ సందర్భంలో అందరం భావోద్వేగానికి గురయ్యాం’’ అని తాహిర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం