కోహ్లీసేన ఇంగ్లాండ్లో.. మరో జట్టు శ్రీలంకలో
న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంకో మూడు వారాల్లో బ్రిటన్కు బయల్దేరబోతోంది విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు. జూన్ 18-22
జులైలో టీ20, వన్డే సిరీస్కు బీసీసీఐ సన్నాహాలు
కోల్కతా: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంకో మూడు వారాల్లో బ్రిటన్కు బయల్దేరబోతోంది విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు. జూన్ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక కోహ్లీసేన అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్లు ఆడాక, ఆగస్టులో ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అయితే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందు, జులైలో టీమ్ఇండియా టీ20, వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించబోతుండటం విశేషం. ఇంగ్లాండ్లో ఉన్న కోహ్లీసేన.. మధ్యలో శ్రీలంకలో ఎలా పర్యటిస్తుంది అనే సందేహం తలెత్తడం సహజం. అయితే లంకకు వెళ్లబోయేది వేరే భారత జట్టు కావడమే ఇక్కడ విశేషం. ఇంగ్లాండ్ పర్యటనలో భాగమైన ఆటగాళ్లను మినహాయించి పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టులతోనే మరో జట్టును ఎంపిక చేసి లంకకు పంపనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. ఈ పర్యటనలో లంకతో టీమ్ఇండియా అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ లాంటి సీనియర్లకు తోడు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, దేవ్దత్ పడిక్కల్, రాహుల్ తెవాతియా లాంటి కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపే అవకాశముంది. గాయం నుంచి కోలుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా లంకకు వెళ్తాడు. వీళ్లందరికీ టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్