తనయ మరణాన్ని దిగమింగి.. శతకం బాది

తన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆ ఆటగాడు ఆనందంలో తేలిపోయాడు.. కానీ అప్పుడే పుట్టిన ఆ పాప మరణించిందనే వార్త విని షాక్‌లో మునిగిపోయాడు. రంజీట్రోఫీ కోసం జట్టుతో ఉన్న అతను..

Published : 27 Feb 2022 05:35 IST

కటక్‌: తన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆ ఆటగాడు ఆనందంలో తేలిపోయాడు.. కానీ అప్పుడే పుట్టిన ఆ పాప మరణించిందనే వార్త విని షాక్‌లో మునిగిపోయాడు. రంజీట్రోఫీ కోసం జట్టుతో ఉన్న అతను.. వడోదర వెళ్లి తన పాప అంత్యక్రియలకు హాజరయ్యాడు. మూడో రోజుల తర్వాత తిరిగి భువనేశ్వర్‌లో జట్టుతో చేరాడు. బాధను దిగమింగి మ్యాచ్‌ కోసం మైదానంలో దిగడమే కాకుండా ఏకంగా శతకం బాదాడు. అతనే బరోడా ఆటగాడు విష్ణు సోలంకి. చండీగఢ్‌తో గ్రూప్‌- బి రంజీ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతను 104 పరుగులు చేశాడు. తన తనయ మృతితో తీవ్ర దుఃఖంలో ఉండి శతకం చేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. టీమ్‌ఇండియాలో చోటే లక్ష్యంగా నిలకడగా రాణిస్తున్న విష్ణు.. ఇంత బాధలోనూ శతకం చేయడం గొప్ప విషయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతని సెంచరీ సాయంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 517 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 168కే కుప్పకూలిన చండీగఢ్‌.. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 231/2తో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని