సెమీస్‌కు అర్జున్‌

జులియస్‌ బేర్‌ జనరేషన్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ కెరటం అర్జున్‌ ఇరిగేశి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం క్వార్టర్స్‌లో అర్జున్‌ టైబ్రేక్‌లో క్రిస్టోఫర్‌ యూ (అమెరికా)పై

Published : 24 Sep 2022 03:20 IST

జులియస్‌ బేర్‌ చెస్‌

న్యూయార్క్‌: జులియస్‌ బేర్‌ జనరేషన్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ కెరటం అర్జున్‌ ఇరిగేశి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం క్వార్టర్స్‌లో అర్జున్‌ టైబ్రేక్‌లో క్రిస్టోఫర్‌ యూ (అమెరికా)పై విజయం సాధించాడు. ఈ పోరులో తొలి, మూడు గేమ్‌లను అర్జున్‌ గెలవగా.. రెండు, నాలుగు గేమ్‌లను క్రిస్టోఫర్‌ దక్కించుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. బ్లిట్జ్‌ పద్ధతిలో జరిగిన టైబ్రేక్‌లో తొలి గేమ్‌లో పైచేయి సాధించిన అర్జున్‌.. రెండో గేమ్‌ను డ్రా చేసుకుని ముందంజ వేశాడు. సెమీస్‌లో లీమ్‌ క్వాంగ్‌ (వియత్నాం)తో అర్జున్‌ తలపడనున్నాడు. మరోవైపు భారత సంచలనం ప్రజ్ఞానంద ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో అతడు 1-3తో విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ) చేతిలో పరాజయం చవిచూశాడు. క్వార్టర్స్‌ తొలి గేమ్‌లోనే ఓడిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రెండు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. తప్పక గెలవాల్సిన నాలుగో గేమ్‌లో విన్సెంట్‌ 42 ఎత్తుల్లో విజయం సాధించడంతో ప్రజ్ఞానందకు నిరాశ తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని