హర్మన్‌కు అయిదో ర్యాంకు

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. మంగళవారం ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో హర్మన్‌ 4 స్థానాలు మెరుగై అయిదో ర్యాంకు సొంతం చేసుకుంది.

Published : 28 Sep 2022 02:45 IST

దుబాయ్‌: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. మంగళవారం ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో హర్మన్‌ 4 స్థానాలు మెరుగై అయిదో ర్యాంకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో హర్మన్‌ (143 నాటౌట్‌; 111 బంతుల్లో) అద్వితీయ సెంచరీతో అదరగొట్టింది. ఓపెనర్‌ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగై ఆరో ర్యాంకు సాధించింది. దీప్తి శర్మ 8 ర్యాంకులు మెరుగై 24వ స్థానంలో నిలిచింది. ఆటకు వీడ్కోలు పలికిన పేసర్‌ జులన్‌ గోస్వామి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానం   సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని