SA vs IND: టీమ్‌ఇండియాకు షాక్‌.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కీలక పేసర్ దూరం!

మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్‌ షమి (Mohammed Shami) దూరమయ్యే అవకాశముంది. 

Published : 14 Dec 2023 20:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India)కు షాక్‌! డిసెంబరు 26 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్‌ పేసర్ మహ్మద్ షమి (Mohammed) దూరమవుతాడని సమాచారం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన షమి ప్రస్తుతం చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. దీన్ని బట్టి చూస్తే షమి ఈ సిరీస్‌కు దూరమైనట్లే. కెప్టెన్‌ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా, అశ్విన్‌, నవ్‌దీప్‌ సైని, హర్షిత్ రాణాతోపాటు టెస్టు సిరీస్‌కు ఎంపికైన మరికొంత ఆటగాళ్లు  డిసెంబరు 15న దక్షిణాఫ్రికాకు పయనం కానున్నారు. వీరితో షమి వెళ్లట్లేదు. అతడు స్వదేశంలోనే ఉండి చికిత్స తీసుకుంటూ కోలుకునే ఛాన్స్ ఉంది. జనవరి 25 నుంచి భారత్‌లో ఇంగ్లాండ్‌తో ప్రారంభంకానున్న ఐదు టెస్టుల సిరీస్‌లో షమి ఆడే అవకాశం ఉంది. అయితే, షమి స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికాలోనే ఉంది. అందులోంచి ఒక బౌలర్‌ని టీమ్‌ఇండియాలోకి తీసుకునే అవకాశముంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని