WPL: హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ముంబయి
గుజరాత్ జెయింట్స్పై ముంబయి ఇండియన్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (95*) ఒంటి చేత్తో తన జట్టును గెలిపించింది.
దిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో గుజరాత్ జెయింట్స్పై ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్మన్ప్రీత్ కౌర్ (95: 48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్ యాస్తికా భాటియా (49: 36 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ బౌలర్లలో షబ్నమ్, తనూజా కన్వర్, ఆష్లీ గార్డనర్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. బెత్ మూనీ (66; 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), దయాళన్ హేమలత (74; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారతి ఫుల్మాలి (21*; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించింది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్ 2, హేలీ మాథ్యూస్, షబ్నిమ్, పుజా వస్త్రాకర్, సజనా తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.