Ravi Shastri:ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. అక్కడే కరోనా సోకి ఉండొచ్చు:రవిశాస్త్రి
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు సమయంలో టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు ముందు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవిశాస్త్రికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్గా
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు సమయంలో టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు ముందు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవిశాస్త్రికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్గా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆపై ఇద్దరు ఫిజియోలకు కూడా కరోనా సోకింది.దీంతో భారత శిబిరంలో కరోనా రావడానికి రవిశాస్త్రియే ప్రధాన కారణమని పలు విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం రవిశాస్త్రి కొవిడ్ నుంచి కోలుకొని భారత్కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు.ఈ సందర్భంగా రవిశాస్త్రి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు. పుస్తకావిష్కరణ కార్యక్రమంపై స్పందిస్తూ...‘ఆ కార్యక్రమంలో నేను కలిసిన వ్యక్తులు బాగానే ఉన్నారు. అందుకే నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆటగాళ్లు తమ గదుల్లో నిరంతరం ఉండటం కంటే.. బయటకు వెళ్లి వేర్వేరు వ్యక్తులను కలవడం మంచిది. ఓవల్ టెస్ట్కు 5000 మంది ప్రేక్షకులు వచ్చారు. తక్కువ మంది ఉన్న పుస్తకావిష్కరణకు వెళ్లిన నాపై వేలెత్తిచూపడానికి ఏమీ లేదు. ఈ కార్యక్రమానికి దాదాపు 250 మంది హాజరయ్యారు. వారిలో ఎవరికీ వైరస్ సోకలేదు. కాబట్టి నేను భయపడలేదు’అని అన్నాడు.
ఒక్క పారాసిటామల్ మాత్ర కూడా వేసుకోలేదు
‘10 రోజులపాటు ఐసోలేషన్లో ఉన్నాను. ఆ పది రోజుల్లో నాకు ఎటువంటి లక్షణాలు లేవు. కేవలం గొంతు నొప్పి ఒక్కటే ఉంది. శరీర ఉష్ణోగ్రత అధికంగా లేదు. ఒక్కసారి కూడా జ్వరం రాలేదు. నా ఆక్సిజన్ స్థాయులు ఎప్పుడూ 99 శాతంగా ఉన్నాయి. ఐసోలేషన్లో ఉన్న పది రోజుల పాటు నేను మందులు వాడలేదు. కనీసం ఒక్క పారాసిటమాల్ కూడా వేసుకోలేదు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
అక్కడే కరోనా సోకి ఉండొచ్చు
భారత శిబిరంలో కొవిడ్ సోకడానికి కారణం మీరేనా అని ప్రశ్నించగా.. 'ఆగస్టు 31 పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. నాకు సెప్టెంబర్ 3న పాజిటివ్గా తేలింది. మూడు రోజుల వరకు వైరస్ లక్షణాలు బయటపడవు. కాబట్టి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాకు వైరస్ సోకలేదు. లీడ్స్లోనే వైరస్ సోకి ఉండొచ్చు. ఇంగ్లాండ్ జులై 19న కరోనా ఆంక్షలను సడలించింది. దీంతో హోటళ్లు, లిఫ్ట్లు అన్ని తెరుచుకున్నాయి.అప్పుడూ ఏమైనా జరిగి ఉండొచ్చు’అని బదులిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.