Pujara: ఒక సెంచరీ.. 1,443 రోజులు.. 52 ఇన్నింగ్స్లు.. పుజారా సాధించేశాడు
ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. స్టార్ ప్లేయర్లు కూడా జట్టులోస్థానం కోల్పోయి కనుమరుగవుతుంటారు. అయితే పుజారా మాత్రం పడిన చోటే లేచి నిలబడి తనకంటూ ఉన్న ప్రత్యేకతను చాటి చెప్పాడు. ఫామ్ కోసం పడిన కష్టానికి సరైన ఫలితం పొందాడు.
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ నిరీక్షణను ‘నయా వాల్’ బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్లో సహనానికి మారుపేరుగా నిలిచిన అతగాడు ఒకానొక సమయంలో జట్టుకు భారంగా మారాడనే విమర్శలు తెచ్చుకొన్నాడు. ఇంకెన్నాళ్లు భరిస్తారు అనే మాటలు వినిపించాయి. దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోవాల్సి వచ్చింది. టెస్టుల్లో వరుసగా కీలక ఇన్నింగ్స్లు ఆడిన ఛెతేశ్వర్ పుజారా టెస్టుల్లో ఎప్పుడో జనవరి 2019లో సెంచరీ బాదాడు. ఇప్పుడు తాజాగా 52 ఇన్నింగ్స్లు.. 1,443 రోజులు గడిస్తేకానీ మరో శతకం పుజారా ఖాతాలో పడటం గమనార్హం. ఎట్టకేలకు బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో గుండెలపై భారం దించుకొన్నాడు. మొదటి ఇన్నింగ్స్లోనే (90) శతకానికి కాస్త దూరంలో నిలిచి నిరాశకు గురైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేశాడు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత కెరీర్లో 19వ శతకం బాదిన పుజారా.. ఇదేదో ఆచితూచి ఆడుతూనో.. ఎక్కువ బంతులను వృథా చేసి సెంచరీ సాధించలేదు. జట్టుకు అవసరమైన సమయంలో వన్డే మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తూనే కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులు రాబట్టాడు. ఓపెనర్ శుబ్మన్ గిల్ (110)తో కలిసి రెండో వికెట్కు 113 పరుగులు జోడించాడు. దీంతో బంగ్లా ఎదుట 500కిపైగా భారీ లక్ష్యం నిర్దేశించడంలోకీలక పాత్ర పోషించాడు.
కారణమదేనా..?
జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత పుజారా వంటి స్టార్ ఆటగాడు దేశీయ పోటీల్లో ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగని కేవలం దేశవాళీ క్రికెట్ ఆడితే ఇక్కడి పిచ్ పరిస్థితులు మాత్రమే తెలుస్తాయి. విదేశాల్లో రాణించాలంటే ఆ తరహా వికెట్ మీద ఆడితేనే ప్రయోజనం ఉంటుందని భావించాడు. దీంతో కౌంటీ క్రికెట్కు నిలయమైన యూకేకి పయనమయ్యాడు. సర్రే తరఫున ఆడిన పుజారా.. వరుస మ్యాచుల్లో సెంచరీలతో కదం తొక్కాడు. ఇవన్నీ టెస్టులు అనుకొంటే పొరపాటే.. కేవలం 50 ఓవర్ల మ్యాచుల్లోనే దంచి కొట్టాడు. వన్డేలకు కూడా పనికొస్తాననే సంకేతం పంపాడు. సర్రే తరఫున ఆడిన అనుభవంతో ఫామ్లోకి వచ్చిన పుజారాకి.. తాజాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ మంచి అవకాశంలా దొరికింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుతంగా ఆడిన పుజారాకు నాలుగేళ్లపాటు శతకం కొట్టలేదనే భారం కూడా దిగిపోయింది. రానున్న కాలంలో ఈ ‘నయా వాల్’ కఠిన పరిస్థితుల్లోనూ దృఢంగా ఆడతాననే భరోసాను అభిమానుల్లో కల్పించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.