CWG 2022: రెజ్లింగ్‌లో అదరగొట్టిన సాక్షి మాలిక్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం..

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండో స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.

Updated : 15 Aug 2022 14:45 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండో స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. తాజాగా రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్ కామన్వెల్త్‌ పోటీల్లో స్వర్ణం కొల్లగొట్టింది. 62 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కెనడాకు చెందిన అనా గొడినెజ్‌పై సాక్షి మాలిక్‌ విజయం సాధించింది. ఈ పతకంతో కలిపి ఈ పోటీల్లో భారత్‌ 8 స్వర్ణాలు  సాధించింది. సాక్షి మాలిక్‌ గెలవడానికి ముందే రెజ్లింగ్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కెనడాకు చెందిన మెక్‌నెల్‌ను ఓడించి భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. 57 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో అన్షుమాలిక్‌ రజతం తెచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని