IND vs PAK: ప్రపంచ క్రికెట్లో దాయాది దేశాల పోరు కంటే ఏదీ ఎక్కువ కాదు: మాజీలు
ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద పోరు యాషెస్ సిరీస్ కాదని...
ఈసారి టీమ్ఇండియా చెలరేగుతుందన్న మైకెల్ వాన్, గిల్క్రిస్ట్, స్టెయిన్
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద పోరు యాషెస్ సిరీస్ కాదని ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్ పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ను అధికమంది చూస్తారని, ఇదే అసలైన సమరమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ - 2022 షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసేసింది. మరోసారి దాయాది జట్లు ఒకే గ్రూప్లో తలపడనున్నాయి. అక్టోబర్ 23న పాకిస్థాన్తో భారత్ తన తొలి మ్యాచ్ను ఆడనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత రేగింది. ఈ క్రమంలో దాయాది దేశాల పోరుపై మైకెల్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్, డేల్ స్టెయిన్ స్పందించారు.
ఓ క్రీడా ఛానెల్ చర్చా కార్యక్రమంలో మైకెల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్, ఆసీస్ మాజీ ఆటగాళ్లుగా యాషెస్ సిరీస్నే బిగ్గెస్ట్ గేమ్గా భావిస్తాం. అయితే అది తప్పు. భారత్ x పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచే అతిపెద్ద పోరు. రోహిత్ శర్మ సారథిగా అసలైన సవాల్ను ఎదుర్కోనున్నాడు. రాబోయే వరల్డ్ కప్ టోర్నీ ప్రత్యేకంగా నిలవనుంది’’ అని తెలిపాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో భారత్ చెలరేగుతుందని ఆసీస్ మాజీ ఆటగాడు గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ‘‘దాయాదుల మధ్య భారీ పోటీ ఉండటం ఖాయం. గత ప్రపంచకప్లో పది వికెట్ల తేడాతో భారత్పై పాక్ విజయం సాధించింది. కాబట్టే ఈసారి టీమ్ఇండియా చెలరేగుతుందని భావిస్తున్నా’’ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. ‘‘దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటేనే క్రేజీగా ఉంటుంది. అందుకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కావడం విశేషం. ఎంసీజీ అంటే నాకెంతో ఇష్టం. 2015 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియాతో ఇక్కడే తలపడ్డాం’’ అని గుర్తు చేసుకున్నాడు.
గత పొట్టి ప్రపంచకప్లోనూ (2021) మొదటి మ్యాచ్లో పాక్తోనే టీమ్ఇండియా తలపడిన విషయం తెలిసిందే. కోహ్లీ నాయకత్వంలోని భారత్ వరుసగా రెండు మ్యాచ్లను ఓడి సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్ పోటీలు జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు