SA vs IND: మూడో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సమం
మూడో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్ 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో ముగిసింది.
జొహానెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్(South Africa vs India)ను భారత్(Team India) 1-1 తేడాతో సమం చేసింది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా(South Africa) గెలుపొందింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు) వీర విహారం చేయండతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60; 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకంతో మెరిశాడు. 202 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బర్త్ డే బాయ్ కుల్దీప్ యాదవ్ (5/17) దెబ్బకు సౌతాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మిల్లర్(35) టాప్ స్కోరర్ కాగా, మార్క్రమ్ (25), డొనావన్ ఫెరీరా (12) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. జడేజా 2, ముకేశ్ కుమార్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. డిసెంబరు 17 నుంచి సఫారీలతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.
షాక్ల మీద షాక్లు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆది నుంచే షాక్ల మీద షాక్లు తగిలాయి. సిరాజ్ వేసిన మొదటి ఓవర్ మెయిడిన్ కాగా.. ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూ బ్రిజ్కె (4) ఔటయ్యాడు. బ్రిజ్కె బంతిని వికెట్ల మీదికి ఆడుకుని పెవిలియన్ చేరాడు. కాసేపటికే రిజా హెండ్రిక్స్ (8)ని సిరాజ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (5)ని అర్ష్దీప్ వెనక్కి పంపాడు. జడేజా తన తొలి ఓవర్లో మొదటి బంతికే డేంజరస్ మార్క్రమ్ని ఔట్ చేశాడు. డొనావన్ ఫెరీరాను కుల్దీప్ క్లీన్బౌల్డ్ చేయగా.. ఫెలుక్వాయో (0) జడేజా బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. కేశవ్ మహరాజ్ (1)ని క్లీన్బౌల్డ్ చేసిన కుల్దీప్.. తన తర్వాతి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను ఆలౌట్ చేశాడు. అతని బౌలింగ్లో నంద్రి బర్గర్ (1), విలియమ్స్ (0)ని వికెట్ల ముందు దొరికిపోగా.. మిల్లర్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. సౌతాఫ్రికా కోల్పోయిన చివరి ఆరు వికెట్లలో ఐదు కుల్దీప్ పడగొట్టడం విశేషం.
దంచికొట్టిన సూర్యకుమార్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం లభించలేదు. మొదటి ఓవర్లో మూడు బౌండరీలు బాది జోరుమీద కనిపించిన శుభ్మన్ గిల్ (12), తిలక్ వర్మ (0)ని కేశవ్ మహరాజ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. గిల్ వికెట్ల ముందు దొరికిపోగా, తిలక్ మిడాఫ్లో మార్క్రమ్కు చిక్కాడు. ఈ క్రమంలో సూర్యకుమార్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. నాలుగో ఓవర్ వేసిన విలియ్సమ్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ చెరో సిక్స్ బాదారు. కేశవ్ వేసిన ఐదో ఓవర్లో సూర్య ఓ ఫోర్, సిక్స్ రాబట్టాడు. తర్వాత కాస్త నెమ్మదించిన స్కై మళ్లీ టాప్ గేర్లోకి వచ్చాడు. ఫెలుక్వాయో వేసిన 13వ ఓవర్లో వరుసగా 6,4,6,6 బాదేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ క్రమంలో షంసి బౌలింగ్లో జైస్వాల్ పెవిలియన్ చేరాడు. అయినా సూర్య దూకుడు తగ్గలేదు. నంద్రి బర్గర్ బౌలింగ్లో వరుసగా 4,6,4 బాదిన అతడు.. విలియమ్స్ బౌలింగ్లో రెండు ఫోర్లు రాబట్టి శతకానికి చేరువయ్యాడు. జైస్వాల్ ఔట్తో క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ (14) ఈ సారి త్వరగానే పెవిలియన్ చేరగా, విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మొదటి బంతికి సూర్య మూడంకెల స్కోరు అందుకున్నాడు. చివరి ఓవర్లో భారత్ మూడు వికెట్ల కోల్పోయింది. సెంచరీ చేసిన తర్వాతి బంతికే సూర్య బ్రిజ్కెకు క్యాచ్ ఇవ్వగా, జడేజా (4) రనౌట్, జితేశ్ శర్మ (4) హిట్ వికెట్గా వెనుదిరిగారు. సూర్యకుమార్ తాను ఎదుర్కొన్న చివరి 26 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం.
- 4 - సూర్యకుమార్కిది టీ20ల్లో నాలుగో సెంచరీ. స్కై కంటే ముందు రోహిత్ శర్మ, మ్యాక్స్వెల్ ఈ ఘనత సాధించారు.
- 3 - టీ20ల్లో పరుగుల పరంగా భారత్కిది మూడో అతిపెద్ద విజయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!