Tokyo olympics : గుండె కోతను మించిన బాధ.. పతకం చేజార్చుకున్న అదితి! ఒక్క స్ట్రోక్తో మారిపోయిన ఆధిక్యం
భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్కు ఒలింపిక్స్లో నిరాశే ఎదురైంది. ఆమె త్రుటిలో పతకం కోల్పోయింది.
గుండె కోత అంటే ఇదేనేమో! గుండె పగిలేంత బాధ ఎలాగుంటుందో ఆమెకు మాత్రమే తెలుసేమో! మిల్కా సింగ్ 0.01 సెకన్లలో పతకం కోల్పోవడం గుండెల్ని ఎలా మెలిపెట్టేసిందో ఈ తరంలో ఎవరికీ తెలియదు! దానిని వర్ణించడమూ కష్టం. కానీ భారత యువ గోల్ఫర్ అదితి అశోక్ కేవలం ఒకే ఒక్క స్ట్రోక్తో పతకం చేజార్చుకోవడం చూస్తుంటే ఆ 0.01 సెకన్లే గుర్తొస్తోంది!!
నిజానికి అదితి అశోక్ అంటే దేశంలో 90% జనాభాకు తెలియనే తెలియదు. గోల్ఫ్లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతే వారు ఎరగరు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ ముఖ్య అతిథిగా మారిపోయింది. వ్యక్తిగత స్ట్రోక్ప్లేలో ఆమె చూపించిన తెగువ ఇప్పుడు అందరికీ చిరపరిచితం.
అదితి ర్యాంకు 200. అలాంటిది ప్రపంచ నంబర్ వన్ సహా టాప్-10లోని క్రీడాకారిణులకు ఆమె భారీ షాకులిచ్చింది. అంచనాలను తలదన్ని నాలుగో స్థానంలో నిలిచింది. ఎవరూ ఉహించని గోల్ఫ్లో పతకంపై ఆశలు రేపింది. నిజానికి ఆమె గెలిచినంత పనిచేసింది.
వ్యక్తిగత స్ట్రోక్ప్లేలో మూడో రౌండ్ ముగిసే సరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగో రౌండ్లో అదే ప్రదర్శన పునరావృతం చేస్తే ఆమె చరిత్ర సృష్టించేదే. శనివారం ఆమె ఏదో ఒక పతకం సాధిస్తుందనే అంతా అనుకున్నారు. నేడు తుపాను హెచ్చరికలతో ఆట నిలిపేసే సమయానికి లిడియా కో (కివీస్)తో కలిసి అదితి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచింది. అప్పటికి మరో రెండు హోల్స్ మాత్రమే మిగిలున్నాయి.
తుపాను ప్రభావం ఇలాగే ఉండి ఆట జరగదనే అంతా భావించారు! అలా జరిగితే మూడో రౌండ్ వరకే లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అలాంటప్పుడు అదితికి రజతం వస్తుందని మురిసిపోయారు! కానీ వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి దుమారం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. నాలుగో రౌండ్లో అదితి ఐదు బర్డీస్ సాధించింది. 5, 6, 8, 13, 14 హోల్స్ను నిర్దేశిత స్ట్రోక్స్ కన్నా ముందే పూర్తి చేసింది. 9, 11వ హోల్స్కు మాత్రం బోగీస్ ఎదురయ్యాయి. అంటే నిర్దేశిత స్ట్రోక్స్ కన్నా ఎక్కువ తీసుకుంది.
నాలుగో రౌండ్లో ఆమె 3 అండర్ 68 సాధించగా కాంస్యం గెలిచిన లిడియా కో 6 అండర్ 65తో నిలిచింది. అంటే ఆటను 71 స్ట్రోక్స్లో ముగించే బదులు 6 తక్కువ స్ట్రోక్స్తో ముగించింది. దాంతో మొత్తంగా అదితి 15 అండర్ 269 సాధించగా లిడియా 16 అండర్ 268 సాధించింది. కేవలం ఒకే ఒక్క స్ట్రోక్.. ఒకే ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేది.
అదితి రియో ఒలింపిక్స్లో ఉమ్మడిగా 41వ స్థానంలో నిలిచింది. కానీ టోక్యోలో ఏకంగా నాలుగో స్థానానికి మెరుగైంది. కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు ఎక్కువగా జరగకున్నా.. విదేశాలకు ప్రయాణించే అవకాశం లేకున్నా.. ఈ బెంగళూరు అమ్మాయి అద్భుతమే చేసింది. సంప్రదాయ క్రీడల్లోనే కాదు భారతదేశం సరికొత్త, వినూత్నమైన ఆటల్లోనూ రాణించగలదని నిరూపించింది. ఎప్పుడూ చెప్పే మాటే అయినా.. ఆమె పతకాన్ని మించే సాధించింది!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు