Team India: రోహిత్, రాహుల్, పంత్ కాకుండా తెరపైకి కొత్త కెప్టెన్ పేరు
ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇంతకుముందే వెల్లడించడంతో తర్వాతి సారథి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది...
ఇంటర్నెట్డెస్క్: ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇంతకుముందే వెల్లడించడంతో తర్వాతి సారథి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఈ ప్రపంచకప్ తర్వాత భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు ఎవరు జట్టును నడిపిస్తారనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
కెప్టెన్సీ రేసులో ఇప్పటికే రోహిత్, రాహుల్, రిషభ్ పంత్ పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో ఆటగాడి పేరు తెరపైకి వచ్చింది. మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఈ విషయంపై ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ జస్ప్రిత్ బుమ్రా పేరును సూచించాడు. అతడు ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అలాగే అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడని గుర్తుచేశాడు. ‘రోహిత్ కాకుండా మనం పంత్, రాహుల్ పేర్లు కూడా వింటున్నాం. పంత్ టీమ్ఇండియాతో అన్ని దేశాలు తిరిగొచ్చాడు. కొన్నిసార్లు జట్టు నుంచి కూడా వైదొలిగాడు. మరోవైపు టెస్టుల్లో మయాంక్ గాయపడ్డాక రాహుల్ను తీసుకున్నారు. అయితే, బుమ్రా కూడా ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. అతడు అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటున్నాడు. కెప్టెన్సీకి అర్హుడే. పేసర్లు కెప్టెన్సీ చేయొద్దని ఎక్కడా రాసిపెట్టలేదు’ అని నెహ్రా తన అభిప్రాయం పంచుకున్నాడు.
ఇదిలా ఉండగా వచ్చే వారమే టీమ్ఇండియా టీ20 కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది. ఈనెలలో న్యూజిలాండ్తో క్రికెట్ మ్యాచ్లు ఉన్నందున అంతకుముందే ఈ విషయంపై స్పష్టతనిస్తుందని సమాచారం. వచ్చే వారం ప్రపంచకప్ టోర్నీ ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఈ టోర్నీలో భారత్ ప్రస్తుతం గ్రూప్-2లో రెండు విజయాలతో 4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అఫ్గాన్, స్కాట్లాండ్లపై గెలిచిన కోహ్లీసేన అంతకుముందు పాక్, న్యూజిలాండ్తో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈరోజు అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ను ఓడిస్తే టీమ్ఇండియా సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు