IND vs NZ : భారత్ టెస్టు సిరీస్ విజయం.. అక్కసు వెళ్లగక్కిన కివీస్ ఆటగాడు
టీమ్ఇండియా తమ జట్టుపై టెస్టు సిరీస్ గెలవడంపై ట్విటర్ వేదికగా...
నెటిజన్ల ఆగ్రహానికి గురైన మెక్క్లాగన్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా తమ జట్టుపై టెస్టు సిరీస్ గెలుచుకోవడంపై ట్విటర్ వేదికగా స్పందించిన కివీస్ క్రికెటర్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. నవంబర్ 25-29, డిసెంబర్ 3-7 తేదీల్లో న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో బతుకుజీవుడా అంటూ డ్రాతో గట్టెక్కిన కివీస్కు రెండో టెస్టులో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమ్ఇండియా చిత్తు చేసింది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో కివీస్ బ్యాటర్ల విఫలం కావడంతో 372 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో కివీస్ ఓడినా.. ఆ జట్టు బౌలర్ అజాజ్ పటేల్ (10/119) జీవితాంతం గుర్తుండిపోయే రికార్డును సొంతం చేసుకున్నాడు. మాజీలు సహా ప్రస్తుత టీమ్ఇండియా ఆటగాళ్లు అజాజ్ను పొగడ్తలతో ముంచెత్తారు. అలానే కివీస్ ఆటగాళ్లూ భారత ఆటను ప్రశంసించారు. అయితే సిరీస్ ఓటమిపై న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ మెక్క్లాగన్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది.
సాధారణంగా కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్లకు, ఆటగాళ్లకు ఎంతో మర్యాదను ఇస్తుంటారు. తమ జట్టు ఓడినా.. గెలిచినా ఇతరులను అగౌరవపరిచేలా ప్రవర్తించరు. అయితే కివీస్ ఆటగాడు మెక్క్లాగన్ టీమ్ఇండియాకు అభినందనలు చెబుతూ.. ఆ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇంతకీ అతడు ఏం ట్వీట్ చేశాడంటే.. ‘‘ఐసీసీ టెస్టు ఛాంపియన్ అయిన కివీస్ను భారత్ వారి స్వదేశంలో వారికి అనుకూలమైన పరిస్థితుల మధ్య ఓడించడంతో టీమ్ఇండియా ఉత్సాహంగా ఉండి ఉంటుంది.. కంగ్రాట్స్’’ అని డిసెంబర్ 7న ట్విటర్లో పేర్కొన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు. అయితే మరుసటి రోజు జోక్ చేశానని కవరింగ్ ఇస్తూ మరొక ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్ల ట్రోల్స్ మాత్రం ఆపలేకపోయాడు.
‘‘బ్లాక్క్యాప్స్ (కివీస్) అభిమానిగా నువ్వు రెచ్చగొట్టే విధంగా చేసిన ట్వీట్కు ఎంతో నిరుత్సాహ పడ్డా. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. బాగా ఆడిన ప్రత్యర్థి ఆటగాళ్లను అభినందించాలి.. అని సారథి కేన్ విలియమ్సన్ ఎప్పుడూ చెబుతుంటాడుగా’’ అని ఒక క్రికెట్ అభిమాని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అలానే మరొకరు ‘‘ఎవరైనా సరే తమ సొంత దేశాల్లో సింహమే. అంతేకాకుండా నువ్వు (కివీస్ క్రికెటర్ను ఉద్దేశించి) మరిచిపోయావేమో.. ఆసీస్ను ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ను వారి దేశంలోనే టీమ్ఇండియా ఓడించింది.. ఇతరులను గౌరవించడం నేర్చుకో’’ అని హితవు పలికాడు. మరి ఇలా నెటిజన్ల ట్రోల్స్కు గురైన మెక్క్లాగన్ ఇంతవరకు కివీస్ తరఫున ఒక్క టెస్టు మ్యాచూ ఆడకపోవడం గమన్హారం. న్యూజిలాండ్కు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచుల్లోనే ప్రాతినిధ్యం వహించాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: భారత్తో టీ20, వన్డే, టెస్టు సిరీస్లు.. జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా
త్వరలో భారత్తో జరగనున్న టీ20, వన్డే, టెస్టు సిరీస్ల కోసం దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. -
Arshdeep Singh: ‘చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు’.. అర్ష్దీప్ వెల్లడి
డెత్ఓవర్ల హీరోగా అర్ష్దీప్ పదునుదేలుతున్నాడు. తాజా టీ20లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్కు ఓటమిని మిగిల్చాడు. ఈ ఓవర్కు కెప్టెన్ సూర్య తనకు ఏమి చెప్పాడో వెల్లడించాడు. -
Rinku Singh: రింకూ ఆ పాత్రకు సరిపోతాడా!
భారత క్రికెట్ జట్టులో అయిదు-ఆరు స్థానాలు చాలా కీలకం! ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినా.. లేక ఛేదనకు దిగినా ఆ స్థానంలో వచ్చే బ్యాటర్ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. మరెంతో ఒత్తిడి ఉంటుంది. -
IND vs AUS: అంపైర్కు తగిలిన బంతి.. ఆసీస్ కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఆసీస్ (AUS)తో జరిగిన ఐదో టీ20లో భారత్ (IND) ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. -
IND vs AUS: 10 పరుగులే చేసినా రికార్డు సృష్టించాడు.. వాళ్లు ఈ సిరీస్లో ప్రభావం చూపారు: వేడ్
ఆసీస్తో జరిగిన ఐదో టీ20లో భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) 10 పరుగులే చేసినా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. -
IND vs AUS: ముగింపు అదిరింది
ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్పై మొదట భారత్ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. -
Virat Kohli: సఫారీ గడ్డపై కోహ్లి అదరగొడతాడు : ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అదరగొడతాడని, అతని అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా మూడేసి చొప్పున టీ20లు, వన్డేలు, రెండు టెస్టులాడనుంది. -
David Warner: వార్నర్.. టెస్టుల్లో చివరిగా!
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వార్నర్ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో అతనికి చోటు దక్కింది. -
హైదరాబాద్ విజయం
విజయ్ హజారె వన్డే టోర్నీలో హైదరాబాద్ పుంజుకుంది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓడిన హైదరాబాద్.. విదర్భపై విజయం సాధించింది. ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన గ్రూప్-బి మ్యాచ్లో హైదరాబాద్ 30 పరుగులతో (వీజేడీ పద్ధతిలో) నెగ్గింది. -
జెయింట్స్ జోరు
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జోరు ప్రదర్శిస్తోంది. సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో ఆ జట్టు సత్తాచాటింది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో జెయింట్స్ 34-31 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. -
ప్రపంచ అథ్లెటిక్స్కు భారత్ బిడ్
2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి భారత్ బిడ్ వేయనుంది. ఇంతకుముందు 2027 ప్రపంచ టోర్నీ ఆతిథ్యం పట్ల ఆసక్తి కనబరిచిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఇప్పుడు 2029 పోటీలపై దృష్టిసారించనుంది. ‘‘2029 ప్రపంచ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి బిడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. -
Rinku Singh: రింకు రేసులో ఉన్నాడు కానీ..
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ రేసులో రింకు సింగ్ ఉన్నాడు కానీ.. అందుకు అతడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ‘‘2024 టీ20 ప్రపంచకప్ జట్టు రేసులో కచ్చితంగా రింకు సింగ్ కూడా ఉంటాడు. -
జాతీయ ఛాంపియన్షిప్కు అర్జున్, హాసిని
జాతీయ అండర్- 13 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్లో తలపడే తెలంగాణ జట్టులో ఆదిరెడ్డి అర్జున్, హాసిని చోటు దక్కించుకున్నారు. సోమవారం నుంచి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఛాంపియన్షిప్ జరుగనుంది. -
యూరో ఛాంపియన్షిప్ డ్రా విడుదల
ఫుట్బాల్లో ఫిఫా ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆదరణ ఉండే యూరోపియన్ ఛాంపియన్షిప్ డ్రా విడుదలైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీకి వచ్చే ఏడాది జర్మనీ ఆతిథ్యమివ్వనుంది. ఐరోపాలోని అత్యుత్తమ దేశాలు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. -
Team India: భారత్లో వాళ్లను క్షమించారు: రియాజ్
పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ వాహబ్ రియాజ్కు సలహాదారుగా సల్మాన్ భట్ను నియమించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. ఫిక్సింగ్కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొన్న భట్కు హోదాను కల్పించినంద]ుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ
దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ సారథ్యం వహించనున్నారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్ను ఛైర్మన్గా నియమిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!
-
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు
-
Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!
-
Railway: రైల్వే ‘బీస్ట్’ను చూశారా..? వైరల్ అవుతున్న వీడియో
-
Animal Movie: ‘యానిమల్’ మూవీపై రాంగోపాల్వర్మ రివ్యూ.. నాలుగున్నర గంటలున్నా తక్కువే!
-
Jobs: ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్.. ఒకేరోజు 485మందికి జాబ్ ఆఫర్లు