2 రోజుల్లో.. ఖేల్ ఖతం దుకాణ్ బంద్!
క్రికెట్ అంటేనే టెస్టు క్రికెట్. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ క్రికెటే...
ఒకప్పుడు దడపుట్టించిన ఇంగ్లాండ్ ఇప్పుడిలా..
క్రికెట్ అంటేనే టెస్టు క్రికెట్. కాలక్రమంలో వివిధ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినా అసలు సిసలు మజానిచ్చేది ఐదు రోజుల సాంప్రదాయ ఆటే. ఇప్పుడంతా పరిమిత ఓవర్ల హవా నడుస్తున్నా ఒకప్పుడు ఈ సుదీర్ఘ ఫార్మాట్ చూసేందుకే జనాలు ఆసక్తి చూపేవారు. బ్యాట్స్మెన్ పరుగుల ప్రవాహానికి, బౌలర్ల సహనానికి ఈ మ్యాచ్లే ప్రత్యక్ష వేదికలుగా నిలిచేవి. ఇలాంటి రసవత్తర పోరులో ఎన్నో మ్యాచ్లు ఐదు రోజులపాటు పూర్తిగా జరిగేవి. కానీ, ఏకపక్షంగా సాగే మ్యాచ్లు నాలుగు, మూడు లేదా రెండు రోజుల్లోనే ఫలితాలు వచ్చేవి. తాజాగా భారత్ x ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన పింక్బాల్ టెస్టు కూడా ఈ జాబితాలోకే చేరింది. రెండు రోజుల్లోనే ప్యాకప్ చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఇప్పటివరకూ ఎన్ని టెస్టులు ఇలా రెండు రోజుల్లోనే ముగిశాయో.. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం..
ఇంగ్లాండే అత్యధికం..
అంతర్జాతీయ క్రికెట్ ఆరంభమైనప్పటి నుంచీ నేటివరకు మొత్తం 2,412 టెస్టులు జరిగాయి. అందులో 22 మ్యాచ్లు కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. ఇంకా వివరంగా చెప్పుకుంటే.. క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లాండ్ జట్టే అత్యధికంగా 13 సార్లు ఇలా రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్ల్లో భాగస్వామిగా నిలిచింది. అందులో 9 సార్లు విజయం సాధించగా, 4 సార్లు ఓటమి చవిచూసింది. ఇక ఆధునిక క్రికెట్లో 2000 ఏడాది తర్వాత మొత్తం ఏడు టెస్టులు ఇలా రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. అందులోనూ ఇంగ్లాండ్ రెండుసార్లు తలపడగా ఒకటి విజయం సాధించి, మరొకటి ఓటమిపాలైంది. మరోవైపు ఈ ఏడు టెస్టుల్లో జింబాబ్వే అత్యధికంగా మూడుసార్లు పాలుపంచుకుంది. ఆపై భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్లు ఆడాయి. ఈ క్రమంలోనే టీమ్ఇండియా అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్పై విజయాలు సాధించింది.
ఆ జట్టుదే ఆధిపత్యం..
19వ శతాబ్దంలో టెస్టు క్రికెట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడేవి. దాంతో కొన్ని మ్యాచ్లు ఐదు రోజులు జరిగేవి, మరికొన్ని మ్యాచ్లు తక్కువ రోజులు జరిగేవి. ఈ క్రమంలోనే 1882లో తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అప్పుడు ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక 1888లో మరోసారి తలపడిన సందర్భంలోనూ కంగారూలనే విజయం వరించింది. అయితే, తర్వాత చెలరేగిన ఇంగ్లాండ్ అదే ఏడాది వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆసీస్ను చిత్తు చేసింది. ఇక 1889లోనూ మరో రెండు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. 1890లో ఆస్ట్రేలియాపై మరోసారి.. 1896లో దక్షిణాఫ్రికాపై రెండుసార్లు ఇలా రెండు రోజుల్లోనే పని పూర్తి చేసింది ఇంగ్లిష్ జట్టు.
ఆసీస్ తక్కువేం కాదు..
ఇక ఆ తర్వాత పూర్తయిన రెండు రోజుల టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయఢంకా మోగించింది. 1912లో దక్షిణాఫ్రికాపై.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరో విజయం సాధించాయి. ఇక 1921, 1931, 1936, 1946లో కంగారూల జట్టు.. వరుసగా ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లపై ఆధిపత్యం చెలాయించింది. 1946 తర్వాత మళ్లీ రెండు రోజుల్లోనే ఓ టెస్టు మ్యాచ్ ఫలితం తేలింది 2000 సంవత్సరంలోనే. అది కూడా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. తర్వాత 2002లో పాకిస్థాన్పై ఆసీస్, 2005లో జింబాబ్వేపై.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ గెలుపొందాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ 12 ఏళ్ల తర్వాత.. 2017లో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా విజయఢంకా మోగించింది. ఇక చివరగా జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత్ విజేతగా నిలిచింది. 2018లో అఫ్గానిస్థాన్పై, 2021లో ఇంగ్లాండ్పై కోహ్లీసేన అద్భుత విజయాలు సాధించింది.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్