IND vs SA: చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు: వీవీఎస్ లక్ష్మణ్
టీమ్ఇండియా బ్యాటర్లు చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే దక్షిణాఫ్రికాలో మొదటిసారి టెస్ట్ సిరీస్ను గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించారు. భారత
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా బ్యాటర్లు చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే దక్షిణాఫ్రికాలో మొదటిసారి టెస్ట్ సిరీస్ను గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించారు. భారత జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అతిథ్య జట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. మొదటి టెస్టు డిసెంబరు 26 నుంచి ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా, ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో భారత బౌలర్లు ఆకట్టుకున్నా.. బ్యాటర్లు మాత్రం నిరాశపర్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్ రాణించారు. దీంతో టీమ్ఇండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్పై పలు మాజీ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడారు.
‘చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాన్పూర్ టెస్టులో అజింక్యా రహానె ఔటైన తీరు.. అదే టెస్టుతో పాటు ముంబయిలో పుజారా ఔటైన విధానం దాదాపుగా ఒకే రకంగా ఉంది. శుభ్మన్ గిల్ తన ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మల్చగలడని నమ్ముతున్నాను. టీమ్ఇండియా ఐదుగురు పూర్తిస్థాయి బ్యాట్స్మెన్తో ఆడుతుంది. మొదటి ఐదుగురు బ్యాటర్లు క్రీజులో ఎంత సమయం గడిపారనే దానిని లెక్కించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో పొరపాటు జరిగి తప్పులు పునరావృతం అవుతున్నాయని, క్రీజులో కుదరుకున్న తర్వాత కూడా వారు సులభంగా తమ వికెట్ను కోల్పోతున్నారని నేను భావిస్తున్నాను. మంచి జట్లపై బాగా రాణించాలనుకుంటున్నప్పుడు ఈ సమస్యను అధిగమించాలి. ప్రత్యేకించి దక్షిణాఫ్రికాపై గెలవాలనుకుంటే బ్యాటర్లు చెలరేగాల్సిన అవసరం ఉంది’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్