IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్కు మంచిది!
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ ఇప్పటికే ప్రాక్టీస్ను కూడా షురూ చేసేసింది. టీమ్ఇండియా కెప్టెన్గా తొలుత శిఖర్ ధావన్ను ప్రకటించినా.......
ప్రెస్కాన్ఫరెన్స్లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ ఇప్పటికే ప్రాక్టీస్ను కూడా షురూ చేసేసింది. టీమ్ఇండియా కెప్టెన్గా తొలుత శిఖర్ ధావన్ను ప్రకటించినా.. కేఎల్ రాహుల్ రావడంతో సెలెక్షన్ కమిటీ అతడికి జట్టు పగ్గాలను అప్పగించింది. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ వైదొలిగాడు. అతడి స్థానంలో షెహబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. ఆగస్ట్ 18న ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో జట్టు ప్రదర్శన, సన్నద్ధత, సిరీస్ గురించి టీమ్ఇండియా తాత్కాలిక వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
‘‘కేఎల్ రాహుల్ జట్టులోకి రావడం శుభపరిణామం. మన టీమ్కు అతడొక కీలక ప్లేయర్. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ రాబోతోంది. అందుకే రాహుల్ సన్నద్ధత అయ్యేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది. వాషింగ్టన్ సుందర్ చివరి నిమిషంలో తప్పుకోవడం కాస్త నిరాశపర్చింది. త్వరలోనే గాయం నుంచి కోలుకుంటాడని ఆశిస్తున్నా. ఇక జింబాబ్వే కూడా ఇటీవల బాగా రాణిస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లు శతకాలు సాధిస్తూ ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. అయితే పాజిటివ్ మైండ్సెట్తో మేం ఆడతాం. నా వరకైతే అత్యుత్తమంగా రాణించి జట్టు కోసం పరుగులు చేస్తా. ఇది నాకొక మంచి అవకాశం. జింబాబ్వేలోని సికిందర్ రజా చాలా బాగా ఆడుతున్నాడు. తప్పకుండా జింబాబ్వే జట్టు కోసం చాలాకాలం ఆడతాడు. అయితే అతడి కోసం మా బౌలర్లు మంచి ప్రణాళికతో వస్తారని భావిస్తున్నా’’ అని వివరించాడు.
జింబాబ్వేతో భారత్ మ్యాచ్లు ఆడటం ప్రపంచ క్రికెట్కు ఎంతో మంచి చేస్తుందని ధావన్ అభిప్రాయపడ్డాడు. ‘‘చిన్న జట్లతో పెద్ద టీమ్లు క్రికెట్ ఆడటం అన్ని విధాలా మంచిది. జింబాబ్వేతో సిరీస్ ఆడటం కూడా ఇరు జట్లకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. ఉత్తమ క్రికెట్ ఆడేందుకు వారికి మంచి అవకాశం. ఇక టీమ్ఇండియాలోనూ యువ క్రికెటర్లు ఉన్నారు. అందుకే ఇలాంటి మ్యాచ్లు వారితోపాటు మన ఆటగాళ్లకూ ఉపయోగపడుతుంది. ఇటీవల వన్డే ఫార్మాట్ గురించి చాలా వార్తలు వింటున్నాం. అయితే 50ఓవర్ల ఆట అద్భుతమైంది. ఎప్పుడు దాడి చేయాలి.. ఎక్కడ డిఫెన్స్ ఆడాలనే విషయాలను బ్యాలెన్స్ చేయడం వన్డే ఫార్మాట్లోనే సాధ్యం. ఇదేమీ తీసేయదగిన గేమ్ కాదని నా అభిప్రాయం. ఇలాంటి క్రికెట్ను నేను చాలా ఆనందిస్తా’’ అని ధావన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
వివిధ దేశాలకు చెందిన దాదాపు 14,250 మంది క్రీడాకారుల కోసం ‘ఒలింపిక్ విలేజ్’ సిద్ధమవుతోంది. -
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
Suryakumar Yadav: ముంబయి ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అతడు ఐపీఎల్లో ఆడకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త హెయిర్ స్టైల్తో బరిలోకి దిగుతున్నాడు. -
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
ఈ సీజన్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. తన పదవీకాలం ముగిసే సమయానికి కేకేఆర్ని మెరుగైన స్థితిలో ఉంచుతానని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
UPSC Civils 2024: ‘సివిల్స్’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్ ఇదే..
-
Pawan Kalyan: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు