సుచిత్ర ఎల్లా, పుల్లెల గోపీచంద్‌లకు బిజినెస్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం

ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఏసీసీ) 2020 సంవత్సరానికి ‘బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’లను ప్రదానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం

Published : 15 Feb 2021 04:57 IST

వడపళని, న్యూస్‌టుడే: ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఏసీసీ) 2020 సంవత్సరానికి ‘బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’లను ప్రదానం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమానికి సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్‌ స్వాగతం పలికారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఫార్మా రంగంలో హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా, ఆర్కిటెక్చర్‌ రంగంలో ఆస్కార్‌ అండ్‌ పొణ్ణి అసోసియేట్స్‌కి చెందిన డాక్టర్‌ పొణ్ణి కాన్‌సెస్సావో, గ్రామీణ విద్యాభివృద్ధికి కృషి చేసిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ వీఎంఎం ప్రసాద్‌, క్రీడా రంగానికి అందించిన సేవలకుగాను పుల్లెల గోపీచంద్‌, ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన పుణెలోని శివార్‌ నేచురల్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వినాయక్‌ సి.హెగన పురస్కారాలు అందుకున్నారు. డీఆర్డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు సి.నాగేంద్ర ప్రసాద్‌ వందన సమర్పణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని