Mani Shankar Aiyar: ‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది.
దిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న భారతీయుల రూపురేఖలపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) మరోసారి పార్టీని ఇరుకునపడేశారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని గౌరవించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి.
భారత్-పాక్ (India-Pakistan) సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘‘పాకిస్థాన్తో మనం చర్చలు జరపాలి. అంతేగానీ సైన్యంతో రెచ్చగొట్టొద్దు. అలా జరిగితే ఉద్రిక్తతలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ దేశం వద్ద అణుబాంబులు (Atom Bombs) ఉన్నాయి. అందువల్ల ఆ దేశాన్ని మనం గౌరవించాలి. వారిని గౌరవించకపోతే భారత్పై అణు బాంబులు ఉపయోగించాలని ఆలోచన చేస్తారు. మనవద్దా ఆ అస్త్రాలు ఉన్నాయి. కానీ లాహోర్పై మనం ప్రయోగిస్తే.. దాని తాలూకు రేడియేషన్ అమృత్సర్ను చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు’’ అని అయ్యర్ ఆ వీడియోలో అన్నారు.
ఏప్రిల్లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలాకోట్ దాడి గురించి ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పాక్కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. భారత్కు హాని తలపెట్టిన ముష్కరులు వారి స్వదేశానికి పారిపోయినా వేటాడి మరి హతమార్చుతామని అన్నారు. వీటిపై స్పందిస్తూనే అయ్యర్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు: మరో వివాదంలో శామ్ పిట్రోడా
కాంగ్రెస్ అసలు రూపం ఇదే: భాజపా
కాగా.. అయ్యర్ వ్యాఖ్యలపై భాజపా (BJP) నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వీడియోను కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేస్తూ.. ‘‘ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వాస్తవ సిద్ధాంతం బయటపడుతోంది. పాకిస్థాన్కు అండగా ఉండటం, వారి మద్దతు తీసుకోవడం. అవసరమైతే సియాచిన్ను వదులుకోవడం..! యాసిన్ మాలిక్ వంటి ముష్కరులకు, ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం. అవినీతికి పాల్పడటం.. పేద ప్రజల సొమ్మును దోచుకోవడం.. విద్వేషంతో విభజన రాజకీయాలకు పాల్పడటం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పణంగా పెట్టి ముస్లింలను బుజ్జగించడం.. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం.. అబద్దాలు, నకిలీ గ్యారంటీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం.. ఇవే వారి సిద్ధాంతాలు’’ అని దుయ్యబట్టారు.
పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్
అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని దూరం జరిగింది. ‘‘అయ్యర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను మేం పూర్తిగా విభేదిస్తున్నాం. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ విధానాలను ప్రతిబింబించదు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి