ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 10 May 2024 12:17 IST

దిల్లీ: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది.  కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున తవ్వకాలు నిలిపివేశారా? లేదా? అనేది తనిఖీ చేయాలని సూచించింది. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మీ చర్యలు అన్నీ కాగితాలపైనే ఉన్నాయని.. క్షేత్రస్థాయిలో కనిపించవని న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలని.. అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలను ఉపయోగించవద్దని గత నెల 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా తవ్వకాలు జరిగాయంటూ తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫొటోలను ఎన్జీవో నేత నాగేంద్రకుమార్‌ అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని