యాదాద్రికి ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి రెండు కిలోల బంగారం వితరణ

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం కోసం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా సమర్పించారు.

Published : 27 Nov 2021 04:06 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం కోసం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా సమర్పించారు. కుటుంబ సమేతంగా యాదాద్రికి వచ్చిన ఆయన బాలాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ క్రతువులో భాగస్వామ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. క్షేత్రంలో రూ.2 కోట్లతో కాటేజీ నిర్మిస్తానని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని