పెళ్లిపత్రికతోపాటు రాజ్యాంగ ప్రతి

మేడ్చల్‌ జిల్లా షాపూర్‌నగర్‌ పరిధి శ్రీనివాసనగర్‌ కాలనీ నివాసి, సామాజిక కార్యకర్త ఎం.వి.మల్లేష్‌ కుమార్తె సోనియా వివాహం ఈ నెల 8న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆహ్వానపత్రికతో పాటు భారత రాజ్యాంగ ప్రతినీ మల్లేష్‌ తన బంధుమిత్రులకు...

Published : 07 Dec 2021 08:41 IST

కూకట్‌పల్లి జెడ్సీ మమతకు రాజ్యాంగ ప్రతిని అందిస్తున్న మల్లేష్‌ (ఆకుపచ్చ చొక్కా ధరించిన వ్యక్తి)

మేడ్చల్‌ జిల్లా షాపూర్‌నగర్‌ పరిధి శ్రీనివాసనగర్‌ కాలనీ నివాసి, సామాజిక కార్యకర్త ఎం.వి.మల్లేష్‌ కుమార్తె సోనియా వివాహం ఈ నెల 8న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆహ్వానపత్రికతో పాటు భారత రాజ్యాంగ ప్రతినీ మల్లేష్‌ తన బంధుమిత్రులకు పంచుతున్నారు. సంబంధిత పుస్తకాలను మొత్తం రెండు వేలు ముద్రించి.. పంపిణీ ఆరంభించారు. సోమవారం ఎమ్మెల్యే వివేకానంద్‌, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, కమిషనర్‌ రవికుమార్‌లకు వాటిని అందజేశారు.

-న్యూస్‌టుడే, షాపూర్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని