ప్రతి గురువారం బస్సుల్లో ప్రయాణించాలి

బస్సుల నిర్వహణ, తీరుతెన్నులపై ప్రయాణికుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు పరిపాలనా విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు.

Published : 08 Dec 2021 05:24 IST

ఆర్టీసీ అధికారులకు ఎండీ సజ్జనార్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: బస్సుల నిర్వహణ, తీరుతెన్నులపై ప్రయాణికుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు పరిపాలనా విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సేవలను మరింత మెరుగు పరిచే క్రమంలో అభిప్రాయ సేకరణ చేసేందుకు ఇక నుంచి ప్రతి గురువారాన్ని ‘బస్‌ దినోత్సవం’గా పరిగణించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని