95 శాతం ఫార్మా సీట్ల భర్తీ
ఎంసెట్ అగ్రికల్చర్ రాసిన విద్యార్థులకు తొలి విడత కౌన్సెలింగ్లో బీఫార్మసీ, ఫార్మా డి సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 8,807 సీట్లుండగా అందులో 8,394(95.31 శాతం) భర్తీ అయ్యాయి.
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్ అగ్రికల్చర్ రాసిన విద్యార్థులకు తొలి విడత కౌన్సెలింగ్లో బీఫార్మసీ, ఫార్మా డి సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 8,807 సీట్లుండగా అందులో 8,394(95.31 శాతం) భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 7,562 సీట్లకు 7,162, ఫార్మా డిలో 1183కి 1170 సీట్లు నిండాయి. 413 సీట్లే మిగిలాయి. మొత్తం 120 కళాశాలల్లో 43 చోట్ల సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సీట్లు పొందినవారు ఈ నెల 10 లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ నవీన్మిత్తల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM