Ukraine Crisis: కడవరకూ పోరాడతాం.. వెనక్కు తగ్గేదే లేదు
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యాపై కడవరకూ పోరాడతామని, ఈ విషయంలో ఇసుమంతైనా వెనక్కు తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. తాము
బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ జెలెన్స్కీ వ్యాఖ్యలు
మరోవైపు... రష్యాతో రాజీకి సంసిద్ధత?
నాటో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయనని వెల్లడి
దొనెట్స్క్, లుహాన్స్క్ల ‘స్వతంత్ర హోదా’పైనా సానుకూలత?
రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పిలుపు
లండన్: రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యాపై కడవరకూ పోరాడతామని, ఈ విషయంలో ఇసుమంతైనా వెనక్కు తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. తాము విడిచిపెట్టబోమని, యుద్ధంలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని, ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి మంగళవారం వీడియో ద్వారా ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ చేసిన ‘నెవర్ సరెండర్’ ప్రసంగాన్ని తలపించేలా మాట్లాడారు. షేక్స్పియర్ వ్యాఖ్యలనూ ఉటంకించారు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి విదేశీ నేత ప్రసంగించడం ఇదే తొలిసారి. అయితే అంతకుముందు ‘ఏబీసీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రష్యాతో నాటో యుద్ధం చేయదని, ఆ కూటమి సభ్యత్వం కోసం ఇక తాను ఒత్తిడి చేయబోనని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ‘‘వివాదాస్పద అంశాలన్నా, రష్యాను ఎదుర్కోవాలన్నా నాటోకు భయం. అందుకే ఉక్రెయిన్ను చేర్చుకోవడానికి ఆ కూటమి సిద్ధంగా లేదు. ఈ విషయం అర్థమయిన తర్వాత నేను చల్లబడ్డాను. నాటో సభ్యత్వం కోసం ఇక నేను ఒత్తిడి చేయను. మోకాళ్లపై నిలబడి ప్రాధేయపడే దేశానికి నేను అధ్యక్షుడిని కాను’’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వతంత్ర భూభాగాలుగా గుర్తించిన దొనెట్స్క్, లుహాన్స్క్ల విషయంలోనూ రాజీకి సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని స్వతంత్ర భూభాగాలుగా రష్యా గుర్తించడంపై అడిగిన ప్రశ్నకు జెలెన్స్కీ బదులిస్తూ- ‘‘ఈ రెండు ప్రాంతాలను ఒక్క రష్యా తప్ప మరే దేశాలూ గుర్తించలేదు. ఇవి సూడో రిపబ్లిక్లు. అయినప్పటికీ ఈ భూభాగాలు మున్ముందు ఎలా ఉండాలన్న దానిపై చర్చించి, రాజీకి వచ్చేందుకు నేను సిద్ధం. ఉక్రెయిన్లోనే ఉండాలని కోరుకుంటున్న ఈ భూభాగాల్లోని ప్రజలు ఎలా జీవించాలన్నదే మాకు ముఖ్యం. అధ్యక్షుడు పుతిన్ ఇక చేయాల్సింది చర్చలను ప్రారంభించడమే’’ అని పేర్కొన్నారు. దీంతో ఆయన రష్యాతో రాజీకి వస్తున్నారా? అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మిగ్-29 యుద్ధ విమానాలను ఇస్తాం: పోలండ్
తమకు యుద్ధ విమానాలు ఇవ్వాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తున్న తరుణంలో.. అమెరికా సూచన మేరకు తమ వద్దనున్న మిగ్-29 యుద్ధ విమానాలన్నింటినీ జర్మనీలోని అమెరికా వాయుసేన స్థావరానికి తరలించడానికి సంసిద్ధమని పోలండ్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్