Srisailam Dam: శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు!
శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో
అదనపు వరద మళ్లింపునకు చర్యలు
మరో స్పిల్వే అవసరం
ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాలి
తుది నివేదిక సమర్పించిన పాండ్యా కమిటీ
ఎం.ఎల్. నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్
శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి పరిశీలించాలని సూచించింది. ప్లంజ్పూల్ సహా డ్యాం, స్పిల్వేకు సంబంధించిన మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫార్సు చేసింది. ప్రస్తుత స్పిల్వే సామర్థ్యానికి తగినట్లు లేదని తెలిపింది.
శ్రీశైలం డ్యాం భద్రతపై గత కొన్నేళ్లుగా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. కానీ వీటి సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఎ.బి.పాండ్యా ఛైర్మన్గా పదిమంది నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. ఇదే సమయంలో 2021లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి ఓ నివేదిక సమర్పించింది. గతంలో కమిటీల సిఫార్సులు, సీడబ్ల్యూసీతోపాటు తమ పరిశీలనలో తేలిన అంశాలు, చర్యలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదిక ఇచ్చింది. వరద అంచనాను బట్టి, ముందుగానే డ్యాంలోని నీటిని ఖాళీ చేయడం, అదనపు స్పిల్వే నిర్మాణం, వరద నీటిని కుందూ లాంటి పక్క బేసిన్కు మళ్లించడం, ప్రస్తుత డ్యాం గరిష్ఠ నీటిమట్టం 892 అడుగులను మరింత పెంచడం, పై నాలుగు అంశాలనూ కలిపి చేయడం వంటి ప్రత్యామ్నాయాలను కమిటీ సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
అదనపు స్పిల్ వే అవసరం
డ్యాంకు ఎగువన అయిదు కి.మీ. దూరంలో అదనపు స్పిల్వే నిర్మాణానికి అవకాశం ఉంది. ప్రస్తుత స్పిల్వే పూర్తిగా కాంక్రీటుతో కూడుకున్నది. అదనపు స్పిల్వేకు బ్రీచింగ్ సెక్షన్ (అవసరమైతే గండి కొట్టే ఏర్పాటు) ఉండాలి. ఇక్కడ 2.75 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం తవ్వి మిగిలింది బయట నిర్మాణం చేపట్టవచ్చు.
* కొంత వరదను కుడివైపు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా చెన్నై తాగునీటికి, ఇతర ప్రాజెక్టులకు మళ్లించవచ్చు. ఎడమవైపున ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అనువైన ప్రాంతం ఉంది.
* కేంద్ర జలసంఘం, ఐఎండీల వద్ద వరద అంచనాకు ఆధునిక వ్యవస్థలున్నాయి. వీటిని ఉపయోగించుకొని ముందుగానే డ్యాంలో ఉన్న నీటిని ఖాళీ చేయడం ఒక మార్గం. దీనికి పరిపాలన యంత్రాంగం చాలా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
* ప్రస్తుత స్పిల్వేకు ఎక్కువ ఎత్తులో రేడియల్ గేట్లు ఉండేలా మార్పుచేయడం, ప్రస్తుత స్పిల్వే క్రస్ట్లెవెల్ తగ్గించే విషయాన్ని ఆలోచించాలి. దీనివల్ల ప్రాజెక్టు ప్రయోజనాలపై పడే ప్రభావాన్నీ పరిశీలించాలి.
* ప్రస్తుత గరిష్ఠ నీటి నిల్వ (ఎం.డబ్ల్యు.ఎల్)కు తగ్గట్లుగా డ్యాం ఎత్తు పెంచడానికి ముంపు సమస్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం
‘వెయ్యేళ్లలో అత్యధిక వరద ప్రవాహం అవకాశాలపై 2006లో అధ్యయనం చేయగా, 26.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తేలింది. ప్రస్తుతం ఉన్న శ్రీశైలం స్పిల్వే సామర్థ్యం 13.20 లక్షల క్యూసెక్యులు. గరిష్ఠ నీటి మట్టం 890 అడుగులను పరిగణనలోకి తీసుకొంటే 14.55 లక్షల క్యూసెక్కులు. అయితే 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డ్యాంలో నీటిమట్టం 896 అడుగులకు చేరగా 14.80 లక్షల క్యూసెక్కులు గేట్ల ద్వారా బయటకు వదిలారు. 2006లో గరిష్ఠ వరద ప్రవాహంపై అధ్యయనం చేస్తే 2009లోనే దానికి దగ్గరగా వచ్చింది. కానీ 2021లో అధ్యయనం చేసిన కేంద్ర జలసంఘం దీనిపై ఏమీ మాట్లాడలేదు. మా అధ్యయనం ప్రకారం గరిష్ఠ వరద 17.88 లక్షల క్యూసెక్కులు. మొత్తం పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు 256 ఉప పరీవాహక ప్రాంతాలుగా విభజించి సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 1964 సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు కుంభవృష్టి కురిసింది. ఆత్మకూరు ప్రాంతంలో మూడు రోజుల్లోనే 600 మి.మీ. వర్షపాతం నమోదైంది’ అని పాండ్యా కమిటీ తన నివేదికలో పేర్కొంది. డ్యాం భద్రతకు చర్యలు ప్రారంభించే ముందు పీఎంఎఫ్పై మళ్లీ అధ్యయనం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
ప్లంజ్పూల్ భద్రతకు గుంత..
స్పిల్వే గేట్ల నుంచి నీళ్లు కింద పడి మళ్లీ ఎగిరి పడే ప్రాంతం (ప్లంజ్పూల్)లో ఏర్పడిన భారీ గుంత డ్యాం భద్రతకు ముప్పు. రెండువైపులా గట్లు, పునాది ఇలా అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దీనిపై వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి. భూభౌతిక శాస్త్రవేత్తలతో అంచనా వేయించాలి. ఇప్పటికే నష్టం జరిగిన ప్రొటెక్టివ్ సిలిండర్స్ రీహాబిటేషన్పై చర్యలు తీసుకోవాలి.
* ప్లంజ్పూల్ కుడి, ఎడమగట్లకు తదుపరి నష్టం వాటిల్లకుండా మరమ్మతులు చేపట్టాలి. డ్యాం గ్యాలరీలో డ్రెయిన్ల సరిచేత, పటిష్ఠమైన కమ్యునికేషన్ వ్యవస్థ ఏర్పాటు, ప్రధాన స్పిల్వే గేట్ల నుంచి నీటి లీకేజీ నివారణ వంటి చర్యలు తీసుకోవాలి.
* రివర్ స్లూయిస్ గేట్ల నిర్వహణ చాలా కాలంగా సరిగా లేదు. అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తక్షణమే దృష్టి పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే