భాజపా బడా నాయకులు త్వరలో యూపీ ప్రచార బరిలోకి

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ నేతలు బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఈ నెల 26 తరువాత ప్రచార బరిలోకి దిగనున్నారు. మథుర, గౌతమబుద్ధనగర్‌ జిల్లాల్లో కేంద్ర

Published : 26 Jan 2022 05:06 IST

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ నేతలు బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఈ నెల 26 తరువాత ప్రచార బరిలోకి దిగనున్నారు. మథుర, గౌతమబుద్ధనగర్‌ జిల్లాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రచారం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 27న, లేదా ఆ తర్వాత భాగ్‌పత్‌, గాజియాబాద్‌ జిల్లాల్లో పర్యటిస్తారు. కరోనా ఆంక్షల దృష్ట్యా నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

బహిరంగ సభలకు మాయావతి సన్నాహాలు

బీఎస్పీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతి బహిరంగ సభల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు. ఫిబ్రవరి 2న ఆగ్రాలో ఆమె ఒక బహిరంగ సభకు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తరువాత మాయావతి పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇది. అనంతరం వేర్వేరు రోజుల్లో మథుర, అలీగఢ్‌, గౌతంబుద్ధనగర్‌, ఎటావా తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని