వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలయ్యే
చేర్యాల, న్యూస్టుడే: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలయ్యే ఈ జాతర మూడు నెలల పాటు జరుగుతుంది. ఉగాది పండగకు ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఉత్సవాలు ముగుస్తాయి. జాతర ప్రారంభమైన మొదటి సోమవారం హైదరాబాద్ భక్తులు ఆనవాయితీగా నిర్వహించాల్సిన ‘పట్నం-అగ్నిగుండాలు’ కార్యక్రమాలను కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేశారు. భక్తులు వర్షాన్నీ లెక్కచేయకుండా జాతరకు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మొదటి రోజు 25 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ పాలక మండలి ఛైర్మన్ భిక్షపతి, ఈవో బాలాజీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్