Australia student visa: ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మన కరెన్సీలో అది సుమారు రూ.16,35,000. ఈ నిబంధన మే 10 నుంచి అమల్లోకి రానుంది. గత ఏడు నెలల్లో విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్సు ఇలా పెంచడం రెండోసారి. ఆంథోనీ ఆల్బనీస్ (Australia) ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపైనా భారం పడనుంది.
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు.. అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ ఖాతాలో ఉన్నట్లు చూపెట్టాల్సి ఉంటుంది. ఈ వీసా డిపాజిట్ కనీస పరిమితి గతంలో 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉండేది. గతేడాది అక్టోబర్లో దాన్ని 24,505 డాలర్లకు పెంచగా.. తాజాగా 29,710 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 19,576 అమెరికన్ డాలర్లతో సమానం.
ఆస్ట్రేలియాలో... అడుగుపెడదామా!
కొవిడ్-19 ఆంక్షల సడలింపు తర్వాత ఆస్ట్రేలియా వైపు వలసలు ఎక్కువయ్యాయి. దీంతో అద్దె ఖర్చులు భారీగా పెరగడంతోపాటు వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం ఇబ్బందికరంగా మారింది. ఇలా పెరుగుతోన్న విద్యార్థుల వలసలు, మోసపూరిత దరఖాస్తులను నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా విద్యార్థి వీసాలపై నియంత్రణ పెడుతోంది. వీటిలో భాగంగా ఐఈఎల్టీఎస్ స్కోరును కూడా ఇటీవల పెంచింది. అంతేకాకుండా విద్యార్థులను ఎంపిక చేసుకొనే క్రమంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 విద్యాసంస్థలపై కఠిన చర్యలుంటాయని అక్కడి హోంశాఖ హెచ్చరించింది.
భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జనవరి-సెప్టెంబర్ 2023 మధ్యకాలంలో దాదాపు 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయోగంలో తెలుగు వ్యక్తి గోపీచంద్ తోటకూర (Gopichand Thotakura) విజయవంతంగా రోదసీలోకి వెళ్లి వచ్చారు. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ కింగ్ చార్లెస్ III కంటే ఎక్కువని వెల్లడైంది. -
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు