వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌ ప్రశంస

కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలందిస్తున్నారని  ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు.

Published : 24 Jan 2022 04:56 IST

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలందిస్తున్నారని  ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ‘‘మహారాష్ట్రకు చెందిన గర్భిణికి భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం చేశారు. జనగామ ఎంసీహెచ్‌లో కరోనాతో ఉన్న గర్భిణికి డాక్టర్‌ సుగుణాకర్‌రాజు నేతృత్వంలోని బృందం సురక్షితంగా కాన్పు చేసింది. వైద్య సిబ్బందికి అభినందనలు’’అని ట్విటర్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని