‘మంత్రి అఫిడవిట్‌ తొలగింపు’పై ఈసీకి నివేదిక

రాష్ట్రంలో 2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్‌ తొలగించారన్న ఫిర్యాదుపై ఆ జిల్లా కలెక్టరు ఇచ్చిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ తెలిపారు.

Published : 26 Jan 2022 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2018లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అఫిడవిట్‌ తొలగించారన్న ఫిర్యాదుపై ఆ జిల్లా కలెక్టరు ఇచ్చిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లు దాఖలు చేశారని, అందులో ఒకదాన్ని తొలగించారంటూ సి.రాఘవేంద్రరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై నివేదిక పంపాల్సిందిగా సీఈసీ తెలంగాణ అధికారులను కోరింది. ఆ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక పంపాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వాటితో పాటు 4 దఫాలు అఫిడవిట్లు దాఖలు చేయవచ్చు. తొలగింపు అన్నది సాఫ్ట్‌వేర్‌ వ్యవహారమని వచ్చిన ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి గత నెలలోనే పంపినట్లు గోయల్‌ తెలిపారు. ఈ అంశంపై దిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది. కోర్టులో జరిగిన తాజా పరిణామాలపై తమకు సమాచారం లేదన్నారు. గతంలో ఎన్నికల సంఘం అమలు చేసిన జనసిస్‌ అనే సాఫ్ట్‌వేర్‌లో లోపమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ లోపాన్ని 2019లో గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం దాని స్థానంలో ఎన్‌కోర్‌ అనే మరో సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చింది. ఆ సమయంలో ఎన్నికలు జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సమస్య వచ్చినట్లు ఓ అధికారి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని