Corona Third Wave: ఇక ఆంక్షల్లేని జీవితం గడపొచ్చు
రాష్ట్రంలో కరోనా మూడోదశ ముప్పు ముగిసిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రజలు ఆంక్షలు లేని సాధారణ జీవితాన్ని గడపొచ్చని స్పష్టం చేశారు.
మూడో ముప్పు ముగిసినట్లే!
విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు
కరోనా కనుమరుగు కాలేదనేది మరవొద్దు
మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాల్సిందే
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మూడోదశ ముప్పు ముగిసిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రజలు ఆంక్షలు లేని సాధారణ జీవితాన్ని గడపొచ్చని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించుకోవచ్చని సూచించారు. అయితే కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అప్రమత్తం చేశారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ నిబంధనలను పాటిస్తూనే అన్ని కార్యకలాపాలూ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. భక్తులు మేడారం జాతరకు వెళ్లొచ్చని తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్య సంచాలకులు విలేకరులతో మాట్లాడారు.
సాధారణ ఫ్లూగా రూపాంతరం!
‘‘వచ్చే వారం, పదిరోజుల్లో రోజుకు వంద కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితి వస్తుంది. మూడోదశలో ఒమిక్రాన్ బీఏ-2 ఉపరకం వేరియంటే 70 శాతం నమోదైంది. 4 వారాల కిందట 5 శాతం నమోదైన పాజిటివిటీ రేటు ఇప్పుడు 2 శాతానికి తగ్గిపోయింది. 7 రోజుల్లోనే కోటి ఇళ్లలో జ్వర సర్వేలు చేపట్టి, లక్షల మందికి ఔషధ కిట్లను అందించాం. ఒమిక్రాన్ తీవ్రమైనదే అయినా.. టీకాలను సకాలంలో అధికులకు పంపిణీ చేసి.. సమర్థంగా ఎదుర్కోగలిగాం. అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో 40-50 శాతం కూడా వ్యాక్సినేషన్ జరగకపోవడంతో అక్కడ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపింది. భవిష్యత్లో ఎన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా.. ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేశాం. వచ్చే కొన్ని నెలలపాటు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు తక్కువ. రాబోయే రోజుల్లో కరోనా సాధారణ ఫ్లూగా రూపాంతరం చెందే అవకాశాలే అధికం. కొత్త వైరస్లు వస్తూ.. కాలానుగుణ ఫ్లూ మాదిరిగా వస్తూపోతూ ఉంటుంది. కొవిడ్ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. భవిష్యత్లో అన్ని వేరియంట్లను తట్టుకునే టీకాలు అందుబాటులోకి వస్తాయి. కొవిడ్ చికిత్సానంతర సమస్యలు రెండో దశతో పోల్చితే మూడోదశలో తక్కువే. ఈ ఏడాది జనవరి 31 వరకూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తర్వాత పొడిగిస్తూ ఉత్తర్వులివ్వలేదంటే.. ఎత్తివేసినట్లే. విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రత్యక్ష తరగతులతోనే విద్యార్థులకు ఉపయోగం. మేడారం జాతరకు వచ్చే లక్షల మంది భక్తుల కోసం తాత్కాలికంగా 150 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశాం’’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు.
కొత్తగా 1,061 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,061 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,79,971కి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,102 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా 69,892 నమూనాలను పరీక్షించారు. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 274 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,36,317 కొవిడ్ టీకాలను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?