రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు
కొత్త జోనల్ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వం
నేడు సీనియారిటీ జాబితాల ప్రదర్శన
11 నుంచి 15 వరకు జిల్లా కమిటీల సమావేశాలు
15 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు
బదలాయింపు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం బుధవారం వరకు సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి, తమ కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఉన్నతాధికారులు ప్రదర్శించాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహాయించి... వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఉద్యోగుల నుంచి బదిలీల కోసం ఐచ్ఛికాలను స్వీకరిస్తారు. పదో తేదీన ఈ దరఖాస్తుల ఆధారంగా సీనియారిటీ జాబితాను పరిశీలిస్తారు. 11 నుంచి 15 తేదీ వరకు బదలాయింపులపై జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు జరుగుతాయి. 15వ తేదీన సొంత జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ అవుతాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా అయిదు జిల్లాల్లో ఉద్యోగుల బదలాయింపులకు ఐచ్ఛికాలు ఇచ్చి ప్రక్రియను కొనసాగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా స్థాయి బదలాయింపుల అనంతరం జోనల్, బహుళ జోనల్ ఉద్యోగుల బదలాయింపులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. జోనల్, బహుళ జోనల్ బదిలీలపై పర్యవేక్షణకూ అధికారులను నియమిస్తారని తెలుస్తోంది.
* ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం సాయంత్రంలోగా ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని శాఖలు, కలెక్టర్లు తమ తమ పరిధిలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సమర్పించాలని ఆదేశించారు. బదలాయింపులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు.
* టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్లు సీఎస్ను కలిశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ ఐచ్ఛికాలు ఇస్తేనే బదిలీల్లో పరిపూర్ణత...
ప్రభుత్వం చేపడుతున్న జోనల్ బదిలీల్లో పలు కీలక అంశాలు, ఐచ్ఛికాలను చేర్చితేనే ఉద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) సూచించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంగళవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్లతో కూడిన ప్రతినిధి బృందం సీఎస్ సోమేశ్కుమార్తో భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ బదిలీలపై చేసిన సూచనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని ట్రెసా ప్రతినిధులు తెలిపారు. వారు సూచించిన కీలకాంశాలు
* వివిధ కేడర్ల పోస్టులకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ బదిలీలకు ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇవ్వాలి.
* ప్రొఫార్మాలో స్పౌస్, పీహెచ్సీ (దివ్యాంగుల కోటా) కేటగిరి, మెడికల్ గ్రౌండ్స్ ఐచ్ఛికాలు తప్పనిసరిగా పొందుపర్చాలి.
* కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు 2016లో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీలు చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాతోపాటు ఉద్యోగంలో చేరాక మొదటి నియామక జిల్లా (ఎస్టాబ్లిష్మెంట్ జిల్లా)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* రెవెన్యూశాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన గరిష్ఠ కేడర్ స్ట్రెంత్ను నిర్ధారించాలి.
* డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు కల్పించాలి.
* డీపీసీ ఆమోదం పొంది తహసీల్దార్ల పోస్టింగ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న డీటీలకు పోస్టింగ్ ఇవ్వాలి.
* ప్రభుత్వ అవసరార్థం దూర ప్రాంతాల్లో నియమించిన ప్రొబెషనరీ డీటీలకు జిల్లాలకు బదిలీ అవకాశం కల్పించాలి.
* వీఆర్వోలకు బదిలీ ఐచ్ఛికం ఇవ్వాలి.
జోనల్ విధానంతో సంపూర్ణన్యాయం: శ్రీనివాస్గౌడ్
టీజీవోల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు కొత్త జోనల్ విధానం ద్వారా సంపూర్ణన్యాయం జరుగుతుందని, సొంత జిల్లాల్లో, జోన్లలో శాశ్వతంగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పక్కాగా, సకాలంలో పూర్తయ్యేందుకు టీజీవో, టీఎన్జీవో తదితర సంఘాలు సహకరించాలన్నారు. సర్దుబాటైన వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. సంఘం బాధ్యులందరూ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్